
- మహబూబ్నగ్ర జిల్లా కొల్లూరు సమీపంలో ప్రమాదం
నవాబుపేట, వెలుగు : ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టడంతో తల్లీకొడుకు చనిపోయారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కొల్లూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. ఎస్సై విక్రం తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేటకు చెందిన మరికంటి లక్ష్మమ్మ (50), ఆమె కొడుకు మరికంటి యాదగిరి (22) కలిసి బైక్పై కొందుర్గు గ్రామంలోని బంధువుల ఇంట్లో పెండ్లికి హాజరయ్యారు.
పెండ్లి ముగిసిన అనంతరం మధ్యాహ్నం నవాబుపేటకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కొల్లూరు గ్రామ సమీపంలోని దేపల్లిగేట్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తల్లీకొడుకు స్పాట్లోనే చనిపోయారు. లక్ష్మమ్మ భర్త వెంకటయ్య ఫిర్యాదుతో కాసులాబాద్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ శ్రీకాంత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.